ఐటీ అండ... భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 591 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 163 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.86 శాతం వరకు పెరిగిన టెక్ మహీంద్రా షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 591 పాయింట్ల లాభంతో 81,973 వద్ద ముగిసింది. నిఫ్టీ 163 పాయింట్లు పెరిగి 25,127 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.86%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.32%), ఎల్ అండ్ టీ (2.02%), ఐటీసీ (1.72%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.70%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-1.85%), టాటా స్టీల్ (-1.49%), బజాజ్ ఫైనాన్స్ (-1.23%), యాక్సిస్ బ్యాంక్ (-0.68%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.67%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News