ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
- గ్రామస్థాయిలో చైర్మన్గా సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి
- మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్గా కౌన్సిలర్ లేదా కార్పోరేటర్
- కన్వీనర్గా పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్
ఇద్దరు డ్వాక్రా గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ కమిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనసాగనుంది. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.