Central Team: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం

Team from Centre visits flood hit areas in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో వరద బీభత్సం తాలూకు నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేడు రాష్ట్రానికి వచ్చింది. కృష్ణా జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం వరద నష్టాన్ని పరిశీలించింది. పెనమలూరు, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో కేంద్ర బృందం పర్యటన సాగింది. 

బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేపట్టారు. నీట మునిగిన ఇళ్లు, పొలాల దుస్థితిని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందానికి రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు.
Go Back to Shorts
Central Team
Floods
Andhra Pradesh

More Telugu News