హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్
- పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేఏ పాల్ పిటిషన్
- పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమన్న పాల్
- విచారణను సోమవారానికి వాయిదా వేసిన కోర్టు
రాజీనామాలు చేయకుండా పార్టీ మారిన ఫిరాయింపుదారులు అధికారాలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.
ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు... అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీని మారిన వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ లను బీఆర్ఎస్ కోరింది.