అర్జెంటుగా ఐదొందలు పంపిస్తారా.. సీజేఐ పేరుతో ఆన్ లైన్ మోసం
- ఢిల్లీలో ఓ వ్యక్తికి మెసేజ్ పంపించిన మోసగాడు
- సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సీజేఐ
- కేసు ఫైల్ చేసి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
సీజేఐ పేరుతో పంపిన ఆ మెసేజ్ లో.. తాను కన్నాట్ ప్లేస్ లో ఉన్నానని, కోర్టులో జరగబోయే కొలీజియం మీటింగ్ కు అర్జెంటుగా వెళ్లాలని దుండగుడు పేర్కొన్నాడు. క్యాబ్ కోసం రూ.500 కావాలని, ఆ మొత్తం పంపిస్తే కోర్టుకు వెళ్లగానే తిరిగి పంపించేస్తానని కోరాడు. నమ్మకం కలిగించేందుకని చెప్పి ఆ మెసేజ్ ఐపాడ్ నుంచి పంపించినట్లు కలరింగ్ ఇచ్చాడు. కాగా, దేశంలో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలోనే ఈ మెసేజ్ వెలుగుచూడడం గమనార్హం.