పోలవరం ఫైళ్ల దగ్ధం ఘటనలో పలువురు ఉద్యోగులపై వేటు
కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న కారం బేబీ, కె.నూకరాజు, స్పెషల్ ఆర్ఐ కళాజ్యోతి, సబార్డినేట్ రాజశేఖర్ లను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు కుమారి, సత్యదేవిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.