వారి వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వలేం: కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు
- ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత
- ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమన్న సుప్రీంకోర్టు
- సీబీఐ, ఈడీకి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు
కవిత మధ్యంతర బెయిల్ అంశానికి సంబంధించి సీబీఐ, ఈడీకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు. ఈ నెల 20న విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం తెలిపింది.