బహ్రెయిన్ జైల్లో సిరిసిల్ల వాసి... కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ
- పాస్పోర్ట్ పోగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో మానువాడ నర్సయ్య
- నర్సయ్యకు అండగా ఉంటానని కేటీఆర్ హామీ
- భారత్కు రప్పించేందుకు కృషి చేస్తానని వెల్లడి
నర్సయ్యకు అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయనను భారత్కు రప్పించేందుకు కృషి చేస్తానన్నారు. నర్సయ్యను తీసుకువచ్చేలా విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బహ్రెయిన్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై విభాగం, బీఆర్ఎస్ ఎన్నారై విభాగం సమన్వయం చేసుకొని విడుదలకు సహకరించాలని సూచించారు.