హమాస్ నూతన చీఫ్గా ‘డెడ్ మ్యాన్ వాకింగ్’.. ఉద్రిక్తతల వేళ ప్రకటన
- గతవారం టెహ్రాన్లో హత్యకు గురైన ఇస్మాయిల్ హనియే
- గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై దాడికి పథక రచన చేసింది సిన్వరే!
- దాడి తర్వాత కనిపించకుండా పోయిన వైనం
- మళ్లీ ఇప్పుడు చీఫ్గా తెరపైకి
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి చరిత్రలోనే అతిపెద్దది. ఈ దాడికి పథక రచన చేసింది సిన్వరేనని అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్ చెబుతున్న దాని ప్రకారం హమాస్ దాడిలో 1,198 మంది మరణించారు. 251 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడి తర్వాత సిన్వర్ అదృశ్యమయ్యారు. తమపై దాడికి ప్రతీకరంగా ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక, భూతల దాడుల్లో 39,653 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు హమాస్ తెలిపింది. కాగా, తమ భూభాగంలో హనియేను హత్య చేయడంపై ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే హమాస్ తమ నూతన చీఫ్ను ప్రకటించడం గమనార్హం.