యామినీ కృష్ణమూర్తి మృతిపై సీఎం చంద్రబాబు స్పందన
- ఢిల్లీలో కన్నుమూసిన ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి
- తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
- నాట్య రంగంలో ఆమె లేని లోటు తీర్చలేనిదని వెల్లడి
"భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టింది కూడా యామినీ కృష్ణమూర్తి గారే. ఆమె లేని లోటు నృత్య కళా రంగంలో ఎవరూ తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను" అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.