త్రిష నుంచి వస్తున్న 'బృందా' .. అందరిలోనూ అదే ఉత్కంఠ!
- 'బృందా'గా కనిపించనున్న త్రిష
- ఆమె కెరియర్లో ఫస్టు వెబ్ సిరీస్ ఇది
- ఆసక్తిని పెంచుతున్న కంటెంట్
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచే తారాగణం
అలాంటి త్రిష తన కెరియర్లో మొదటిసారిగా వెబ్ సిరీస్ చేసింది .. ఆ సిరీస్ పేరే 'బృందా'. ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ సిరీస్ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతుంది. త్రిష ఈ సిరీస్ లో ఆమె టైటిల్ రోల్ లో కనిపించనుంది. నాయికా ప్రధానమైన పాత్రలు చేయడం త్రిషకి అలవాటే. ఇంతకుముందు ఆమె చేసిన 'రాంగి' .. 'ది రోడ్' వంటి సినిమాలు ఆమెకి మంచి పేరు .. ప్రశంసలు తెచ్చిపెట్టాయి. అలాగే ఆమె ఈ సిరీస్ లో నటించింది.
పోలీస్ ఆఫీసర్ గా ఆమె ఈ సిరీస్ లో నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి అందరిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ అభిమానులలో ఆసక్తి పెరిగిపోతోంది. జయప్రకాశ్ .. రవీంద్ర విజయ్ .. ఇంద్రజిత్ సుకుమారన్ .. ఆమని ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ అంచనాలు పెరుగుతుండటం విశేషం.