2007లో అటవీ పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్... ఫొటోలు చూశారా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అటవీశాఖను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా, జనసేన పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను పంచుకుంది. ఆ ఫొటోలు 2007 నాటివి. అప్పట్లో పవన్ కల్యాణ్ రాజమండ్రి లాలాచెరువులోని ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నారు. అప్పట్లో అటవీ సంబంధిత విషయాలపై ఆసక్తి కలిగి ఉన్న పవన్ కల్యాణ్ కు ఇప్పుడు అదే మంత్రిత్వ శాఖ లభించడం విశేషం.

Pawan Kalyan
Regional Forest Research Center
Rajahmundry
Janasena
Andhra Pradesh

More Telugu News