ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకుంటుంది అనుకుంటున్నా: ఎంపీ విజయసాయి రెడ్డి
- అఖిలపక్ష భేటీ అనంతరం ఎక్స్ వేదికగా స్పందన
- రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించినట్టు వెల్లడి
- కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ
ఇవాళ (ఆదివారం) న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యానని ఆయన తెలిపారు. ఏపీలో దెబ్బతిన్న శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై మాట్లాడానని చెప్పారు. ఏపీలో ఎన్నో సమస్యలు ఉండగా ఒక కులం సమాజాన్ని అణచివేయడం సహా పలు అంశాలను అఖిలపక్ష భేటీలో లేవనెత్తానని ఆయన ప్రస్తావించారు. ఈ పార్లమెంట్ సెషన్లో టీడీపీ వైఖరిని ఎండగడతామని విజయసాయి రెడ్డి అన్నారు.