ఎంపీలతో నేడు కీలక సమావేశం నిర్వహించనున్న చంద్రబాబు
- ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు
- సమావేశానికి హాజరుకానున్న కేంద్ర మంత్రులు
- పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఇప్పటికే ప్రతి ఎంపీకి కొన్ని శాఖల బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడానికి ఎంపీలు ఢిల్లీలో అన్ని ప్రయత్నాలు చేయాలని వారికి చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై దిశానిర్దేశం చేయడంతో పాటు... వాటి ప్రాధాన్యత క్రమాలను వివరించబోతున్నారు.