పల్నాడు జిల్లాలో పులి.. సాసర్‌పిట్‌లో నీళ్లు తాగేందుకు వచ్చిన వ్యాఘ్రం

పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఓ పులి సీసీ కెమెరాకు చిక్కింది. వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో బొటుకులపాయ బేస్‌క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన సాసర్‌పిట్‌లో నీళ్లు తాగిన పులి అందులోంచి బయటకు వెళ్తూ కెమెరాకు చెక్కింది. అడవిలో నీళ్లు లభించకపోవడంతో జంతువులు నీటి కోసం సాసర్‌పిట్ వద్దకు వస్తున్నట్టు గుర్తించారు. పులి నాలుగు రోజుల క్రితమే అక్కడికి వచ్చినట్టు విజయపురిసౌత్ రేంజర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

Tiger
Palnadu
Forest Area
Botukulapaya Base Camp

More Telugu News