యూపీలో విషాదం... శివారాధాన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 27 మంది మృతి
- హత్రాస్ జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమంపై మృత్యు పంజా
- తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తులు
- మృతుల్లో 23 మంది మహిళలు, ఒక చిన్నారి
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సీఎం ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
అంతేకాదు, హత్రాస్ ఘటనపై సమాచారం అందిన వెంటనే సీఎం ఆదిత్యనాథ్ ఇద్దరు మంత్రులను, డీజీపీని సంఘటన స్థలానికి పంపించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆగ్రా అడిషనల్ డీజీపీ, అలీగఢ్ పోలీస్ కమిషనర్ లతో ఓ కమిటీని నియమించారు.
