రాధాకిషన్ రావుకు రెండు రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల పాటు ఆయనకు ఎస్కార్ట్ బెయిల్‌ను ఇచ్చింది. రాధాకిషన్ రావు ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం రాత్రి 7 గంటల వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత నెలలో రాధాకిషన్ రావు తల్లి మృతి చెందారు. అప్పుడు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా ఆయనకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది.

Radhakishan Rao
Phone Tapping Case
Telangana

More Telugu News