Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో సోదాలు... రూ.300 కోట్ల మైనింగ్ అక్రమాలు గుర్తించామన్న ఈడీ

ED searches in Mahipal Reddy residence
షార్ట్స్‌లో చూడండి
పటాన్‌చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి నివాసంలో జరిగిన సోదాలపై ఈడీ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. మహిపాల్ రెడ్డి మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్, హవాలా ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు చేసినట్లు గుర్తించామని తెలిపింది. రూ.300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడించింది. ఈ అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూరిందన్నారు.

మహిపాల్ రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో రూ.19 లక్షల నగదును గుర్తించినట్లు ఈడీ తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గుర్తించామని తెలిపింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించింది. లావాదేవీలన్నీ బినామీ పేర్లతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరువవలసి ఉందని వెల్లడించింది. వీరికి పలువురు బినామీలుగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది.
Go Back to Shorts
Mahipal Reddy
BRS
Telangana
ED

More Telugu News