జగన్ ను కలిసిన రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ
- 2020లో వైసీపీ కోటాలో రాజ్యసభకు వెళ్లిన పరిమళ్ నత్వానీ
- ఇటీవలి ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన ఫలితాలు
- నేడు వైసీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో జగన్ సమావేశం
ఇక, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో, నేడు పరిమళ్ నత్వానీ... వైసీపీ అధినేత జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ జగన్ వైసీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. వైసీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, గురుమూర్తి, పరిమళ్ నత్వానీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై జగన్ తమ పార్టీ ఎంపీలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.