ఢిల్లీలో జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమావేశం
- ఈ నెల 12న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ
- క్యాబినెట్ కూర్పుపై ఎన్డీయే పెద్దల ఫోకస్
- మంత్రివర్గ ఎంపికల బాధ్యతను నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ లకు అప్పగించిన మోదీ
- ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతలతో మాట్లాడుతున్న జేపీ నడ్డా
- కేంద్ర క్యాబినెట్ లో టీడీపీ, జనసేన ప్రాతినిధ్యంపై ఈ రాత్రికి స్పష్టత!
ఈ నేపథ్యంలో, మంత్రివర్గ కూర్పు, మిత్రపక్షాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై చర్చించేందుకు ఢిల్లీలోని తన నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కాసేపట్లో హాజరుకానున్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల డిమాండ్లపై జేపీ నడ్డా ఒక్కొక్కరితో చర్చిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ లో టీడీపీ, జనసేనల ప్రాతినిధ్యంపై ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.