Chandrababu: ఎన్డీయే కూటమి నాయకుడిగా మోదీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నాం: చంద్రబాబు

ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం జరిగిందని తెలిపారు. దేశ ప్రజల ఎన్నికల తీర్పును అనుసరించి, ఎన్డీయే కూటమి నాయకుడిగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాల నేతలందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం అని వెల్లడించారు. 

మోదీ సమర్థ నాయకత్వంలో మన దేశం అభివృద్ధి పథంలో పయనించేలా, తద్వారా ప్రపంచానికే మార్గదర్శిలా ఎదిగేలా మేమంతా కృషి చేస్తాం అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ మేరకు చంద్రబాబు ఎన్డీయే భేటీ ఫొటోలను కూడా పంచుకున్నారు.
Chandrababu
Narendra Modi
NDA
TDP
New Delhi

More Telugu News