మేజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే కూటమి

NDA crosses magic figure in lok sabha polls
  • 291 స్థానాల్లో ముందంజలో ఎన్డీయే
  • 221 స్థానాల్లో ముందంజలో ఇండియా కూటమి
  • వారణాసిలో ముందంజలో ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ కూటమి 291 స్థానాల్లో, ఇండియా కూటమి 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 50కి పైగా స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. ఈసీ వెబ్ సైట్ ప్రకారం ఉదయం గం.10 సమయానికి బీజేపీ 217, కాంగ్రెస్ 78, ఎస్పీ 29, టీఎంసీ 16, టీడీపీ 15, డీఎంకే 13 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇదిలా ఉండగా, వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలోకి వచ్చారు.
Advertisement
Narendra Modi
Lok Sabha Polls
BJP
Congress

More Telugu News