India Today-My Axis: టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్... ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో ఆసక్తికర అంశాలు

India Today exit poll says TDP alone will get magic figure in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 98 నుంచి 120 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. 

టీడీపీకి సొంతంగా 78 నుంచి 96 అసెంబ్లీ స్థానాలు వస్తాయని వెల్లడించింది. ఏపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 175 కాగా... ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్.. 88 స్థానాలు. ఆ లెక్కన మిత్రపక్షాలతో పనిలేకుండానే టీడీపీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటుందని వివరించింది. 

ఇక, టీడీపీ భాగస్వామ్య పక్షాలైన జనసేన 16 నుంచి 18 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ 4 నుంచి 6 స్థానాల వరకు గెలుచుకునే అవకాశముందని వివరించింది. అదే సమయంలో అధికార వైసీపీ 55 నుంచి 77 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో దాదాపు అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీ 0-2 స్థానాల్లో ఉనికిని చాటుకునే అవకాశముందని ఇండియా టుడే- మై యాక్సిస్ వెల్లడించింది. 

ఇక లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ 13 నుంచి 15 స్థానాలు, బీజేపీ 4 నుంచి 6 స్థానాలు, వైసీపీ 2 నుంచి 4 స్థానాలు, జనసేన 2 స్థానాలు గెలిచే అవకాశమున్నట్టు వివరించింది.
Go Back to Shorts
India Today-My Axis
Exit Poll
TDP
Magic Figure
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh

More Telugu News