కింద మంటపెట్టినట్టే.. ఢిల్లీలో వాటర్ ట్యాంకులో సలసలా మరుగుతున్న నీళ్లు.. వీడియో ఇదిగో!
- గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉష్ణోగ్రతలు
- దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు తీసిన వడగాలులు
- వీడియోపై నెటిజన్ల మిశ్రమ స్పందన
- నిజం కాదని కొట్టేస్తున్న వారే ఎక్కువ
ఓ భవనంపైన ఉన్న నీళ్ల ట్యాంకులోని నీళ్లు కింద మంటపెట్టినట్టుగా కుతకుత ఉడికిపోయాయి. ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులోని నీళ్లు ఇలా మరిగిపోతున్నాయంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో విషయంలో నెటిజన్లు రెండుగా విడిపోయారు.
ఒకరు అమ్మో.. ఈ వేడికి ఢిల్లీ జనం ఎలా బతుకుతున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మరికొందరు మాత్రం ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేస్తున్నారు. నీళ్ల బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీలని, 52 డిగ్రీల వద్ద నీళ్లు మరగడం అసాధ్యమని కొట్టిపడేస్తున్నారు. అంతేకాదు, ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత అసలు నమోదు కాలేదని మరికొందరు చెప్తున్నారు.