Sonia Gandhi: సోనియాగాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. దాదాపు అరగంటపాటు ఈ సమావేశం జరిగింది. అంతకుముందు, ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఆయననూ వేడుకలకు ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తయినందున అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Sonia Gandhi
Revanth Reddy
Congress
Telangana Formation Day

More Telugu News