నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కాల్!
- తెలంగాణలో వరుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం
- ఇవాళ ఒకే రోజు ప్రజాభవన్, నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్
- అలర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ సాయంతో విస్తృతంగా సోదాలు
- ఎలాంటి బాంబు ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఊపీరి పీల్చుకున్న పోలీసులు
ఈ ఘటనపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే తాజాగా నాంపల్లిలోని కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని, మరి కాసేపట్లో కూల్చేస్తామని ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కానీ, ఎలాంటి బాంబు ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్గా పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.