‘ఉగ్రం.. వీరం’లోని నృసింహావిర్భావ ఘట్టం ఒళ్లు గగుర్పొడుస్తుంది: చాగంటి
- పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘ఉగ్రం.. వీరం’ గ్రంథం
- ఇంద్రకీలాద్రిపై ఆవిష్కరించిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
- పురాణపండ అసాధారణ ప్రతిభాశాలి అని ప్రశంస
- అలతి అలతి పదాలతో మనసుల్ని కట్టిపేస్తుందన్న ఆలయ ఈవో కేఎస్ రామారావు
'ఉగ్రం.. వీరం' తొలి ప్రతిని చాగంటి నుంచి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం జాయింట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రంథంలోని ప్రహ్లాద, నారసింహుల కథాకథనం అలతి అలతి పదాలతో మనసుల్ని కట్టిపడేస్తుందని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ‘ఉగ్రం..వీరం’ ప్రతులను ఉచితంగా పంపిణీ చేశారు. కాగా, ఈ గ్రంథానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య, అరుణాదేవి దంపతులు సమర్పకులుగా వ్యవహరించారు.