చేవెళ్లలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు
- తన భూమిని కబ్జా చేశాడంటూ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు
- తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ
- బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చేవెళ్ల పోలీసులు
2023లో ఫంక్షన్ హాలును కూల్చివేసి దానిని కబ్జా చేశారని బాధితుడు దామోదర్ రెడ్డి ఆరోపించారు. ఈ భూమికి పంజాబ్ గ్యాంగ్ ను కాపలా ఉంచారని... తాను ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు. కాగా, జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది. అయితే ఆ భూమి తనదేనని... తాను నాలుగేళ్ల క్రితం దానిని కొనుగోలు చేశానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఈ భూమి వ్యవహారంలో జీవన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.