మోదీ చెప్పింది నిజమైతే ఇంకా ఉచిత బియ్యం ఎందుకిస్తున్నారు?: కాంగ్రెస్ నేత వీహెచ్
- కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో తాము విఫలమవుతున్నామన్న వీహెచ్
- మోదీ మూడోసారి గెలిస్తే అదానీ, అంబానీలను మరింత కోటీశ్వరులుగా చేస్తారని మండిపాటు
- దేశం సమష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలని వ్యాఖ్య
మోదీ మూడోసారి గెలిస్తే అదానీ, అంబానీలను మరింత కోటీశ్వరులుగా చేస్తారు తప్ప పేదలకు చేసేదేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ కులగణన చేపడతామని హామీ ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం వేతనం 400 రూపాయలకు పెంచుతామన్నారు.