ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో సేవల సమయం పొడిగింపు!
- ఇవాళ్టి మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
- చివరి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని ప్రకటన
- రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ మ్యాచ్
చివరి మెట్రో రైళ్లు వాటి టెర్మినల్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి ఒంటి గంటకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని ప్రకటించింది. నాగోల్, ఉప్పల్, స్టేడియం అండ్ ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. ఇక రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ మ్యాచ్ కోసం ఇప్పటికే అంతా సిద్ధమైంది.
మ్యాచుకు 3 గంటల ముందు నుంచే ప్రేక్షకులను స్టేడియం లోపలికి పంపించనున్నారు. ఇక ఈ 17వ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన సన్రైజర్స్ ఆరింటిలో గెలిచింది. దీంతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచులో గెలిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.