Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదుల హతం

  • ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు
  • దగ్గరకు రాగానే బలగాలపైకి కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులు
  • ఉగ్రవాదుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత బలగాలు 
Two terrorists killed in gunfight with security forces in JK

జమ్మూకశ్మీర్ లోని కుల్గం జిల్లాలో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భారత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం సమీపంలోకి భద్రతా బలగాలు చేరుకోగానే ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. 

కాగా, అనంత్ నాగ్ -రాజౌరి లోక్ సభ నియోజకవర్గానికి ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. మంగళవారం ఎన్ కౌంటర్ జరిగిన కుల్గం జిల్లా అనంత్ నాగ్ - రాజౌరీ నియోజకవర్గం పరిధిలోనిదే. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్ వేసుకుని ఉన్నారు.

  • Loading...

More Telugu News