రెండు నెలల్లో 90 మంది ఎన్ కౌంటర్.. పౌర హక్కుల సంఘం
- సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
- అబూజ్ మడ్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన నక్సలైట్ మృతదేహం స్వగ్రామానికి..
- కాశవేన రవి మృతదేహానికి నివాళులు అర్పించిన పౌర హక్కుల సంఘం నేతలు
అబూజ్ మడ్ ఎన్ కౌంటర్ లో అమరుడైన కాశవేన రవి అలియాస్ వినయ్ మృతదేహం శనివారం హనుమకొండ జిల్లాలోని ఆయన స్వగ్రామం వంగరకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరుల బంధుమిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం, దళిత లిబరేషన్ ఫ్రంట్, విరాసం తో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు వంగర గ్రామానికి వెళ్లి రవి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 33 ఏళ్ల క్రితం రవి మావోయిస్టు ఉద్యమంలో చేరాడని, అంచెలంచెలుగా ఎదిగి దండకారణ్య డివిజన్ కమిటీ సభ్యుడి దాకా ఎదిగారని హక్కుల సంఘం నేతలు చెప్పారు. ఆదివాసుల హక్కుల కోసం, పెట్టుబడిదారీ వ్యవస్థపై నిత్యం పోరాడారని గుర్తుచేసుకున్నారు.