రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుంది: బొండా ఉమా
- జగన్ అవినీతిని సొంత కుటుంబ సభ్యులే బయటపెడుతున్నారన్న బొండా ఉమా
- వైసీపీ పాలనలో అన్నిరంగాల్లో దోపిడీ జరిగిందన్న బీజేపీ నేత లంకా దినకర్
- సాధ్యం కాని అంశాలతో వైసీపీ మేనిఫెస్టో అంటూ జనసేన మహిళా విభాగం నేత రాయపాటి అరుణ చురకలు
అప్పుల్లో ఏపీకి మొదటి స్థానం: లంకా దినకర్
బీజేపీ నేత లంకా దినకర్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అన్నిరంగాల్లో దోపిడీ జరిగిందన్నారు. పవర్ ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం భారీగా దోచుకున్నారని విమర్శించారు. ల్యాండ్, శాండ్, మైన్, రెడ్ శాండల్ ఇలా అన్నింట్లో దోపిడీనే అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో అప్పుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర పథకాలు, ప్రాజెక్టులకు తమ స్టిక్కర్లు అంటించుకున్నారని లంకా దినకర్ విమర్శలు గుప్పించారు.
వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలు అసాధ్యాలు: రాయపాటి అరుణ
జనసేన మహిళా విభాగం నేత రాయపాటి అరుణ మాట్లాడుతూ.. సాధ్యం కాని అంశాలతో వైసీపీ మేనిఫెస్టో తీచుకొచ్చారని దుయ్యబట్టారు. ఆసుపత్రులకు బకాయిల వల్ల ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదన్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల రూ. 1500కోట్లు బకాయి పడిందని తెలిపారు. పాత అంబులెన్సులకు రంగులేసి కొత్తవిగా బిల్లులు పెట్టారని ఆరోపించారు.