అగ్రవర్ణాలన్నీ జగన్ కే మద్దతు ఇస్తున్నాయి: జోగి రమేశ్
- రాష్ట్ర ఓటర్లను ఒక ఎన్నారై 'వెధవలు' అన్నాడన్న జోగి రమేశ్
- ఎన్నారైలు జగన్ వైపు ఉండాలని సూచన
- కుప్పంలో చంద్రబాబు గెలవడం కూడా డౌటేనని వ్యాఖ్య
ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి జగన్ సీఎం కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని... అలాంటి ఆలోచనలు మానుకోవాలని సూచించారు. 2019 ఎన్నికల్లో ఓట్లు వేయనివారు కూడా ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా నిలబడుతున్నారని చెప్పారు. అగ్రవర్ణాలన్నీ జగన్ కు మద్దతిస్తున్నాయని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తాడో, లేదో అనేది పెద్ద డౌట్ అని చెప్పారు. అన్ని సర్వేలు వైసీపీదే విజయమని చెపుతున్నాయని తెలిపారు.