భూభక్షా పథకంతో రైతుల మెడకు జగన్ ఉరితాళ్లు: దేవినేని ఉమామహేశ్వరరావు
- రెవెన్యూ రికార్డులు సైతం తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపణ
- ఉద్దేశపూర్వకంగా నల్లచట్టాలు తీసుకొచ్చారని ఆగ్రహం
- చంద్రబాబు వీడియోను షేర్ చేసిన టీడీపీ నేత
ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ఇవ్వని భూములపై ఆయన ఫొటో ఏంటని మండిపడ్డారు. వారసత్వంగా వస్తున్న భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం ఏంటని నిలదీశారు. నిద్ర లేవగానే ఆ సైకో బొమ్మను మీరు చూడాలా? అని ప్రశ్నించారు. జగన్ భూమి ఇస్తే ఆయన బొమ్మ వేసుకోవచ్చని, కానీ మీ నాన్న, మా తాత, మీ ముత్తాత ఇస్తే దానిపై ఈ సైకో ఫొటో ఏంటని మండిపడ్డారు. పొలాల్లోనూ ఆయన ఫొటో వేస్తారని, ఇంటికిపోయినా, పొలానికి పోయినా ఆయన ఫొటోనే చూస్తూ మీరు భయపడుతూ ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.