రాయి దాడి నేపథ్యంలో.. జగన్ కు భద్రత భారీగా పెంపు
- జగన్ ప్రయాణించే రోడ్డు మార్గాన్ని సెక్టార్లుగా విభజించిన అధికారులు
- ఒక్కో సెక్టార్ లో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు
- గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు
మరోవైపు జగన్ మేమంతా సిద్ధం యాత్ర గన్నవరం నియోజకవర్గం నుంచి గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సాయంత్రం గుడివాడలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. గాయం కారణంగా వైద్యుల సలహాతో జగన్ ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.