చర్చలు సఫలం.. సీజ్ చేసిన నౌకలోని భారతీయ సిబ్బందిని కలిసేందుకు ఇరాన్ అనుమతి
- ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడి ఖరారు చేసిన విదేశాంగమంత్రి జైశంకర్
- 17 మంది నౌక సిబ్బందితో భారతీయ అధికారులకు భేటీ అయ్యేందుకు దక్కిన అవకాశం
- వారిని విడిపించడంపై కూడా దృష్టిపెట్టిన భారత విదేశాంగ శాఖ
ఆదివారం సాయంత్రం ఆమిర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్ లో మాట్లాడానని జైశంకర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించామని, ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం కాకుండా సంయమనం పాటించాల్సిన ఆవశ్యకత గురించి గుర్తుచేశానని జైశంకర్ పేర్కొన్నారు. సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని ఇరాన్ హామీ ఇచ్చిందని జైశంకర్ వివరించారు.