నేటి నుంచి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారం.. ఈరోజు తొలి సభ!
- ఈ సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ
- చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్
- ఈ నెల 16న కేసీఆర్ రోండో సభ
మరోవైపు సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలె యాదయ్య, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పారు. ఈ నెల 16న సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారని తెలిపారు. సుల్తాన్ పూర్ శివారులోని సింగూర్ చౌరస్తా వద్ద బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కేటీఆర్, హరీశ్ రావు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.