భద్రాద్రిలో 14న ‘శ్రీరామరక్షా స్తోత్రం’ ఆవిష్కరణ.. నవమి నాడు భక్తులకు పంపిణీ
- శ్రీరామ నవమి ఉత్సవాల కోసం ముస్తాబవుతున్న భద్రాచలం
- పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శ్రీరామరక్షా స్తోత్రం’ గ్రంథాన్ని సమర్పిస్తున్న ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణ, సాయి కొర్రపాటి
- గ్యాలరీలో కూర్చుని రామయ్య కల్యాణాన్ని వీక్షించే భక్తులకు పంపిణీ
భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలకు గతంలో టాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి సమర్పించిన అఖండ గ్రంథాలను రచించింది కూడా శ్రీనివాస్ కావడం గమనార్హం. ఇక, తాజా గ్రంథమైన ‘శ్రీరామరక్షా స్తోత్రం’ పుస్తకాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, సాయి కొర్రపాటి సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి పురాణపండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ మహిమోపేత శ్రీరామరక్షా స్తోత్రం గ్రంథాన్ని ఎల్లుండి (14న) ఆలయ ఈవో రమాదేవి ఆవిష్కరిస్తారు.