నల్గొండ మున్సిపాలిటీ ట్యాంకులో పడి 30 కోతుల మృతి ఘటనపై ఘాటుగా స్పందించిన కేటీఆర్!
- నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో ఘటన
- ఈ ఘటనపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్
- ప్రజల ఆరోగ్యం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాలన ఇలా ఉందన్న బీఆర్ఎస్ నేత
"తెలంగాణ మున్సిపల్ శాఖ పని తీరు సిగ్గుచేటు. క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, సాధారణ నిర్వహణను నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టం అర్థమవుతోంది. ప్రజల ఆరోగ్యం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాలన ఇలా దుర్భరంగా మారింది" అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.