ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుంది: మాజీ ఎంపీ జయప్రద
- స్టార్ క్యాంపెయినర్గా కూడా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలనుందని వెల్లడి
- అంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉందని వ్యాఖ్య
- పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ
అయితే, జయప్రద ఏపీ నుంచి బరిలోకి దిగే అవకాశం తక్కువేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ.. టీడీపీ, జనసేనలతో పొత్తులో ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తోంది. టీడీపీ అభ్యర్థులు 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. రెండు లోక్సభ, 21 అసెంబ్లీ సీట్లలో జనసేన తన అభ్యర్థులను బరిలో నిలిపింది. మే 13న ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.