Jagan: ఏడో రోజుకు చేరుకున్న జగన్ 'మేమంతా సిద్ధం' యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదిగో!

  • చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఏడో రోజు యాత్ర
  • సాయంత్రం పూతలపట్టులో బహిరంగసభ
  • రాత్రికి రేణిగుంట సమీపంలో బస
Jagan Memantha Siddham 7th day schedule

మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి ప్రారంభమయింది. ఈరోజు గోడ్లవారిపల్లె, గుండ్లపల్లిలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డు (మొధిగారిపల్లె) వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట సమీపంలోని గురువరాజుపల్లెలో జగన్ బస చేస్తారు. ఈనాటి యాత్ర నేపథ్యంలో... చిత్తూరు జిల్లా సిద్ధమా? అని జగన్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News