కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఆరో జాబితా విడుదల
- ఈ జాబితాలో ఐదుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
- తమిళనాడు, రాజస్థాన్లకు చెందిన ఎంపీ అభ్యర్థుల పేర్ల ప్రకటన
- ఇప్పటివరకు ఆరు జాబితాలలో మొత్తం 190 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 9 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను తొమ్మిది స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాగా, మార్చి 27న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణలోని మిగతా 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.