యాదాద్రి ఆలయ ఘటనపై భట్టి విక్రమార్క స్పందన
- యాదాద్రిలో చిన్న పీటపై కూర్చున్న భట్టి
- దళిత నేతను అవమానించారంటూ విమర్శలు
- కావాలనే తాను చిన్న పీటపై కూర్చున్నానన్న భట్టివిక్రమార్క
ఈ నేపథ్యంలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ యాదాద్రిలో జరిగిన ఘటనపై అర్థంపర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశామని... కావాలనే తాను చిన్న పీట మీద కూర్చున్నానని చెప్పారు. బంజారాహిల్స్ లో జరిగిన సింగరేణి గెస్ట్ హౌస్ శంకుస్థాపన కార్యక్రమంలో నేడు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.