Miss World 2024: చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనాకు మిస్ వర్డల్-2024 కిరీటం

  • ముంబై వేదికగా మిస్ వరల్డ్-2024 పోటీలు
  • మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ భామ, రన్నరప్‌గా లెబనాన్ యువతి
  • టాప్-8కు పరిమితమైన భారత యువతి సినీ శెట్టి
  • ముఖ్య అతిథి నీతా అంబానీకి మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు 
Czech republic beauty christina becomes miss world 2024

ముంబై వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్-2024 పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా దక్కించుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న మొత్తం 112 దేశాల సుందరీమణుల్లో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. క్రిస్టీనా తరువాత తొలి మూడు స్థానాల్లో యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), ఆచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బొత్స్వానా) నిలిచారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో రన్నరప్‌గా లెబనాన్ భామ అజైటౌన్ నిలిచింది. 

భారత్‌కు ఈ పోటీల్లోనూ నిరాశే మిగిలింది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కన్నడ భామ సినీ శెట్టి టాప్-8 స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి వరకూ ఆమె గట్టిపోటీనే ఇచ్చినా అజైటౌన్ కు (లెబనాన్) టాప్-4లో చోటుదక్కడంతో సినీ శెట్టి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతా అంబానీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్‌వుమన్ జూలియా మోర్లీ.. మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేశారు.  

More Telugu News