IAS: ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు

  • ఏపీలో త్వరలో ఎన్నికలు
  • మరి కొన్ని రోజుల్లో నోటిఫికేషన్
  • ఉన్నతాధికారుల బదిలీలు, అదనపు బాధ్యతల అప్పగింతలు చేపడుతున్న ప్రభుత్వం
AP Govt allots additional charges to senior IAS officials

ఏపీలో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా కె.కన్నబాబును నియమించారు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న బుడితి రాజశేఖర్ ను జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కన్నబాబుకు టూరిజం కార్పొరేషన్ ఎండీ, టూరిజం సీఈవోగా అదనపు బాధ్యతలు కేటాయించారు. 

జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మత్స్యశాఖ కమిషనర్ గా ఏ.సూర్యకుమారిని నియమించారు. 

కె.హర్షవర్ధన్ కు అదనంగా మైనారిటీ సంక్షేమశాఖ బాధ్యలు కేటాయించారు. మురళీధర్ రెడ్డికి సెర్ప్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వెంకటరమణారెడ్డికి సీసీఎల్ఏ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

More Telugu News