విశాఖ శారదాపీఠంలో సీఎం జగన్

Jagan in Visakha Sarada Peetham
  • శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో జగన్
  • రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు
  • స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్న సీఎం
విశాఖలోని శ్రీ శారదాపీఠానికి జగన్ వెళ్లారు. శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. శారదాపీఠంలో జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు శారదాపీఠం వద్ద జగన్ కు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వాగతం పలికారు. 
Go Back to Shorts
Jagan
YSRCP
Visakha Sarada Peetham
Andhra Pradesh

More Telugu News