కోటాలో అదృశ్యమై చంబల్లోయలో విగతజీవిగా కనిపించిన జేఈఈ అభ్యర్థి
- రాజస్థాన్లోని కోటాలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
- పరీక్షపేరుతో హాస్టల్ నుంచి బయటకు వచ్చి అదృశ్యమైన రచిత్
- వారం రోజుల గాలింపు అనంతరం చంబల్లోయలో మృతదేహం గుర్తింపు
- అదృశ్యమైన మరో విద్యార్థి కోసం కొనసాగుతున్న గాలింపు
పీయూష్ కపాసియా అనే మరో విద్యార్థి కూడా కోటా నుంచి అదృశ్యమయ్యాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన పీయూష్ జేఈఈకి శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 13 నుంచి కనిపించకుండా పోయాడు. రెండేళ్లుగా కోటాలోని ఇంద్రవిహార్లోని హాస్టల్లో ఉంటున్న పీయూష్ అదృశ్యం కావడానికి ముందు కుటుంబంతో కమ్యూనికేషన్ కట్ చేశాడు. చివరిసారి గత మంగళవారం తల్లితో మాట్లాడాడు. ఆ తర్వాతి నుంచి ఫోన్కాల్స్కు స్పందించడం లేదని పీయూష్ తండ్రి తెలిపారు. ఆ తర్వాత ఫోన్ను స్విచ్చాఫ్ చేసుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీయూష్ కోసం గాలిస్తున్నారు.