Pawan Kalyan: ఈ నెల 20న భీమవరం రానున్న పవన్ కల్యాణ్

  • ఏపీలో త్వరలో ఎన్నికలు
  • టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్
  • ఈ నెల 20న పెద అమిరంలో జనసేన, టీడీపీ నేతలతో భేటీ
Pawan Kalyan will tour in Bhimavaram on Feb 20

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 20న భీమవరంలో పర్యటించనున్నారు. ఆయన హెలికాప్టర్ లో భీమవరం రానున్నారు. పెద అమిరంలో జనసేన, టీడీపీ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఈ నెల 21 కూడా ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. వాస్తవానికి పవన్ ఈ నెల 14న హెలికాప్టర్ లో భీమవరం రావాలని భావించారు. ఇక్కడి విష్ణు కాలేజీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే, హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతించకపోవడంతో పవన్ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే పవన్ పర్యటనను రీషెడ్యూల్ చేశారు.

More Telugu News