India vs England: రోహిత్, జడేజా సెంచరీలు.. ముగిసిన మూడో టెస్ట్ తొలి రోజు ఆట

Centuries of Rohit and Jadeja and The first day of the third test ended
షార్ట్స్‌లో చూడండి
రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 326 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (131), స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (110 నాటౌట్) శతకాలతో రాణించడంతో మంచి స్థితిలో నిలిచింది. ఇక అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆకట్టుకున్నాడు. 66 బంతుల్లో 62 పరుగులు బాదాడు. అయితే దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. 

తొలి సెషన్‌లో టీమిండియా కేవలం 33 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్టు అనిపించింది. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్‌లు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడి ఇన్నింగ్స్‌ను సరిదిద్దారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా నాలుగో వికెట్‌కు ఏకంగా 204 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా (110), కుల్దీప్ యాదవ్ (1) క్రీజులో ఉన్నారు.

భారత బ్యాటింగ్
యశస్వి జైస్వాల్ (10), రోహిత్ శర్మ (131), శుభ్‌మాన్ గిల్(0), రజత్ పటీదార్ (5), రవీంద్ర జడేజా(110 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (62 రనౌట్), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 3 కీలకమైన వికెట్లు తీశాడు. మరో వికెట్ టామ్ హార్ట్లీకి దక్కగా మరో వికెట్ రనౌట్ రూపంలో ఇంగ్లండ్‌కి దక్కింది.
Go Back to Shorts
India vs England
Cricket
Team India
Rajkot test
3rd Test
Rohit Sharma
Ravindra Jadeja

More Telugu News